వాట్సాప్ ద్వారా 161 పౌర సేవలను అందించేందుకు ఏపీ సర్కార్ ఫేస్ బుక్ మెటా సంస్థతో ఒప్పందం చేసుకుంది. ఇందులో భాగంగా గురువారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పౌరులకు సంబంధించిన 161 సేవలను అందుబాటులోకి తీసుకు వచ్చింది. పాలనా పరంగా ప్రజలకు మరింత దగ్గరయ్యేందుకు ఇది దోహదం చేస్తుందన్నారు ఈ సందర్బంగా సీఎం నారా చంద్రబాబు నాయుడు. రాబోయే రోజుల్లో ఈ గవర్నెన్స్ పాత్ర కీలకం కాబోతోందని స్పష్టం చేశారు.