తహశీల్దార్ ద్వారా కులపత్రం ఇవ్వాలి
NEWS Jan 30,2025 08:37 am
మాంగ్ కులస్థులకు తహశీల్దార్ ద్వారా కుల పత్రం జారీ చేయాలంటూ మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లా DROకు వినతి పత్రం అందించారు. ఈ డిమాండ్ ను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని DRO హామీ ఇచ్చారు. మాంగ్ సమాజ్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాంబ్లే శంకర్ మాంగ్, హైదరాబాద్ కమిటీ అధ్యక్షులు కాంబ్లే సుధాకర్, కార్యదర్శి సూర్యవంశీ దిలీప్, ఉపాధ్యక్షులు నామ్ వాడ్ రమాకాంత్, చవాన్ ఉద్ధవ్ పాల్గొన్నారు.