మహాత్మా గాంధీ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చిన ఎమ్మెల్యే
NEWS Jan 30,2025 08:20 am
మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ మెట్పల్లి పట్టణంలోని గాంధీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం వినతి పత్రం సమర్పించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలు అమలు చేయని అసమర్థ ప్రభుత్వం కళ్లు తెరవాలని వినతి పత్రంలో పేర్కొన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు సాయి రెడ్డి, రాజేశ్, శ్రీనివాస్ గౌడ్, సుమన్, రాజారెడ్డి, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.