ఇందూరు జిల్లాను సమున్నత స్థానంలో నిలిపిన నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాల రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది.కళాశాల గత 69 సంవత్సరాలుగా జిల్లా ఘనతను చాటింది. మొదట 3డిగ్రీ కోర్సులతో ప్రారంభమైన ఈ కళాశాలలో ప్రస్తుతం ఆర్ట్స్, సైన్స్లలో 47 డిగ్రీ కోర్సులు, 9పీజీ కోర్సులు ఉన్నాయి.కాకతీయ యూనివర్సిటీ తరువాత బీఎల్ఐఎస్సీ కోర్సు కలిగిన ఏకైక ప్రభుత్వ కళాశాలగా గుర్తింపు పొందింది.ఎ గ్రేడ్ వస్తుందనీ అనుకున్న కళాశాలకు న్యాక్ బీ గ్రేడ్ మాత్రం దక్కింది.