ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో సీఐకి సన్మానం
NEWS Jan 29,2025 04:40 pm
గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అందజేసే ప్రతిష్టాత్మక ఇండియన్ పోలీస్ మెడల్ కు మెట్పల్లి సీఐ నిరంజన్ రెడ్డి ఎంపిక కావడంతో మెట్పల్లి ప్రెస్ క్లబ్ ప్రింట్ మీడియా ఆద్వర్యంలో సీఐ నిరంజన్ రెడ్డిని శాలువా, పూలమాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మెట్పల్లి ప్రెస్ క్లబ్ ప్రింట్ మీడియా అద్యక్షుడు ఆగ సురేష్, ప్రధాన కార్యదర్శి భూరం సంజీవ్, ఉపాధ్యక్షుడు మహమ్మద్ అజీమ్, కార్యవర్గ సభ్యులు సాజీత్, అఫ్రోజ్ తదితరులు పాల్గొన్నారు.