మదనపల్లిలో \ రెండు కళాశాలల విద్యార్థులు గొడవ పడ్డారని వచ్చిన వార్తలలో తమ కళాశాల విద్యార్థులు లేరని సిద్ధార్థ కళాశాల కరస్పాండెంట్ వెంకటరెడ్డి స్పష్టం చేశారు. బుధవారం ఆయన మాట్లాడుతూ మదనపల్లి రెండవ పట్టణ పోలీసు వారికి కూడా ఈ విషయంపై వివరణ ఇచ్చామని తెలిపారు. తమ కళాశాల విద్యార్థులపై వచ్చిన నిరాధార ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.