ప్రజలు ఏదైనా సమస్యలతో వస్తే కార్యాలయాల చుట్టూ తిప్పుకోకుండా అధికారులు త్వరితగతిన వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని రైల్వే కోడూరు శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ అరవ శ్రీధర్ అన్నారు. బుధవారం పుల్లంపేట మండల పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గ్రామాలలో మౌలిక వసతుల కల్పనకు యుద్ధ ప్రాతిపదికన పూర్తి అయ్యే పనులను వెంటనే పూర్తి చేయాలని కోరారు.