మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ బాషా పై తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చినబాబు, జనసేన పార్టీ రాయలసీమ కో - కన్వీనర్ రామదాసు చౌదరి బుధవారం మంత్రికి ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే వలస వచ్చిన వారిని రేషన్ డీలర్లుగా నియమించడం, టౌన్ బ్యాంక్ ఎన్నికలలో వైసీపీ వారు నలుగురిని డైరెక్టర్లుగా నియమించి టిడిపి కార్యకర్తలకు అన్యాయం చేశారని ఆరోపిస్తూ జిల్లా ఇన్చార్జి మంత్రి జనార్దన్ రెడ్డికి పిర్యాదు చేశారు.