రాయచోటి లోని పలు మీ సేవా కేంద్రాలలో ప్రభుత్వం నిర్ణయించిన నిర్ణీత ధరల కంటే ఎక్కువ రుసుము వసూలు చేస్తున్నారని ఫిర్యాదులు రావడంతో మాసాపేట మీ సేవ కేంద్రం, పట్టణంలోని పలు మీ సేవ కేంద్రాలలో బుధవారం తహసిల్దార్ పుల్లారెడ్డి ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. కార్యక్రమంలో తహసీల్దార్ తో పాటు రెవెన్యూ ఇన్స్పెక్టర్ ప్రశాంతి, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.