రాజంపేటలో హిందువులు, ముస్లింలు అభిమానంగా ఒకరిపై ఒకరికి ఆప్యాయత కలిగి జీవనం సాగిస్తున్నారని రాజంపేట ఏఎస్పి మనోజ్ రామనాథ్ హెగ్డే అన్నారు. బుధవారం ఏఎస్పీ కార్యాలయంలో మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రూపొందించిన భారత స్వాతంత్రోద్యమంలో ముస్లింల పాత్ర అనే క్యాలెండర్ ను ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆల్ బదర్ మస్జిద్ అధ్యక్షులు గండికోట గుల్జార్ బాషా, అబ్దుల్ రజాక్ పాల్గొన్నారు.