ఎవరూ ఊహించని విధంగా తెలంగాణ ప్రాంతానికి చెందిన ఉద్యమకారుడు, ఎంఆర్పీఎస్ ఫౌండర్ లీడర్ మంద కృష్ణ మాదిగకు పద్మశ్రీ అవార్డు ప్రకటించింది కేంద్రం. వరంగల్ జిల్లాలోని మాదిగ కుటుంబంలో పుట్టాడు.1994లో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిని స్థాపించి, సమాజంలోని నిర్దిష్ట సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నించారు.ఎస్సీల ఉప వర్గీకరణను డిమాండ్ చేస్తూ ఆయన మూడు దశాబ్దాలుగా అవిశ్రాంత పోరాటం చేయాల్సి వచ్చింది.