సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. అత్యంత ఆధునిక సదుపాయాలు, వసతి సౌకర్యాలతో ఉస్మానియా ఆస్పత్రిని నిర్మించాలని స్పష్టం చేశారు. తన ఆధ్వర్యంలో సచివాలయంలో వైద్య, ఆరోగ్య శాఖపై సమీక్ష జరిపారు. ఈ సందర్బంగా కీలక సూచనలు చేశారు. ఉస్మానియా ఆస్పత్రికి ఘనమైన చరిత్ర ఉందన్నారు. గత కొంత కాలంగా ఈ ఆస్పత్రికి రోగుల రాక పెరిగిందన్నారు. దీంతో సేవలు అందించేందుకు ఇబ్బంది ఏర్పడుతోందన్నారు. 31న ఆస్పత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామన్నారు.