కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. 2024 సంవత్సరానికి గాను జీవన్ రక్షా పదక్ సీరీస్ అవార్డులకు సంబంధించి ఆమోదం తెలిపారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఇందులో భాగంగా జాబితాను వెల్లడించింది. 17 మందికి సర్వోత్తమ్ జీవన్ రక్షా పదక్, 9 మందికి ఉత్తమ్ జీవన్ రక్షా పదక్ , 23 మందికి జీవన్ రక్షా పదక్ , 49 మందికి జీవన్ రక్షా పదక్ సిరీస్ అవార్డ్స్ ను ఖరారు చేసింది. ఆంధ్ర ప్రదేశ్ నుంచి జీవన్ రక్షా పదక్ అవార్డుకు నెల్లి శ్రీనివాసరావు ఎంపికయ్యారు. కాగా మరణాంతరం ఆరుగురికి ఈ అవార్డులు దక్కాయి.