కొత్త పథకాల అమలుపై ఫోకస్
NEWS Jan 26,2025 02:29 am
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన కొత్త పథకాల అమలుపై దృష్టి సారించాలని ఆదేశించారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి. పథకాల ప్రగతిపై జిల్లాల కలెక్టర్లతో కీలక సమావేశం నిర్వహించారు. ప్రతి లబ్దిదారు ఈ కార్యక్రమానికి హాజరయ్యేలా, పండగలా ప్రారంభ వేడుకలు నిర్వహించాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్లకు ఎంపిడీఓ, రేషన్ కార్డులకు తహశీల్దార్ బృందం, రైతు భరోసాకు డిప్యూటీ తహశీల్దార్/రెవెన్యూ ఇన్స్పెక్టర్, ఎంఏఓ ఆత్మీయ భరోసాకు MGNREGS ఏపీవోలు హాజరు కావాలని స్పష్టం చేశారు.