గ్రామసభలను కాంగ్రెస్ పార్టీ సభలుగా మార్చిన ప్రభుత్వం
NEWS Jan 25,2025 03:21 pm
ప్రజాపాలన గ్రామసభలను కాంగ్రెస్ పార్టీ సభలుగా నిర్వహించారని కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ విమర్శించారు. కోరుట్ల ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామసభల వల్ల ప్రజలకు ఏమి ప్రయోజనం లేదన్నారు. ఇందిరమ్మ ఇళ్ళు, రేషన్ కార్డుల మంజూరు విషయంలో స్పష్టత లేదని మండిపడ్డారు.