మల్లాపూర్ మండల కేంద్రంలో జాతీయ ఓటర్ల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఎమ్మార్వో వీర్ సింగ్ ఆధ్వర్యంలో స్థానిక భరతమాత విగ్రహం వద్ద పాఠశాల విద్యార్థులతో కలిసి ఓటర్లతో ప్రతిజ్ఞ చేయించారు. ఓటు హక్కు విలువ గురించి అధికారులు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో డీటీ శ్రీనివాస్, ఆర్ ఐ సురేష్, అంగన్వాడీ టీచర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.