కొండగట్టు అదనపు ఈవోగా కృష్ణ ప్రసాద్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈనెల 18న ఈవోగా బాధ్యతలు స్వీకరించిన శ్రీకాంతరావు సెలవులో ఉండడం వలన, హైదరాబాద్ దేవాదాయ శాఖ హెడ్ ఆఫీస్ లో డీసీఎస్ గా విధులు నిర్వహిస్తున్న కృష్ణ ప్రసాద్ కు కొండగట్టు ఈవోగా అదనపు బాధ్యతలు అప్పగించారు. నూతన ఈవోకు ఆలయ అధికారులు అర్చకులు శాలువాతో సత్కరించి, తీర్థప్రసాదాలు అందజేశారు. ఈనెల 30న హుండీ లెక్కింపు కార్యక్రమం చేపడుతున్నట్లు ఈవో తెలిపారు.