కామారెడ్డి మున్సిపల్ మాస్టర్ప్లాన్ బాధిత రైతుల సమస్యను సీఎం రేవంత్రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని మున్సిపల్ చైర్పర్సన్ ఇందుప్రియ అన్నారు. మాస్టర్ప్లాన్ బాధితుల రైతులు సమస్యను వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, ఇంచార్జి మంత్రి జూపల్లి కృష్ణారావ్, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ సహాకారంతో మాస్టర్ ప్లాన్ రద్దు చేయిస్తామన్నారు. మాస్టర్ప్లాన్ రద్దు జీవో కోసం కృషి చేస్తానని ఆమె హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ స్పందన, రైతులు పాల్గొన్నారు.