ధర్మపురి మండల కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షుడు తిరుపతి, నియోజకవర్గ NSUI అధ్యక్షుడు అప్పం శ్రవణ్ ఆధ్వర్యంలో ధర్మపురి మండలంలోని ABVPకి చెందిన సుమారు 40 మందికి పైగా యువత ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా విప్ లక్ష్మణ్ కుమార్ వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.