తాడిపత్రిలో జేసీ ట్రావెల్స్ కు సంబంధించిన బస్సులు దగ్ధం ఘటనపై స్పందించారు టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి. మీకన్నా జగన్ రెడ్డినే మేలంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. బీజేపీ వాళ్ల లాగా జగన్ ఎప్పుడూ బస్సులు తగలబెట్ట లేదన్నారు. తన బస్సులను ఆపాడన్నారు. 300 బస్సులు పోతే ఏడ్వలేదని, ఇప్పుడు ఎందుకు బాధ పడతానంటూ ప్రశ్నించాడు.