ఏపీకి నిధులు మంజూరు చేయండి
NEWS Dec 17,2024 07:45 pm
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కలిశారు. ఆయన వెంట వెంట టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణ దేవరాయలు కూడా ఉన్నారు. రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత మొదటిసారి ఢిల్లీకి వచ్చారు పయ్యావుల. ఈ సందర్బంగా ఏపీ ఆర్థిక పరిస్థితులు, కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలపై చర్చించారు. నిధులు మంజూరు చేయాలని కోరారు.