రాష్ట్రపతికి సీఎం గ్రాండ్ వెల్ కమ్
NEWS Dec 17,2024 07:27 pm
శీతాకాల విడిది కోసం హైదరాబాద్ కు చేరుకున్నారు దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ , సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రపతికి స్వాగతం పలికారు. మంత్రి సీతక్క, ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్ రావు , ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవి గుప్తాతో పాటు త్రివిధ దళాలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.