మాజీ మంత్రి పేర్ని నానిపై నిప్పులు చెరిగారు మంత్రి కొల్లు రవీంద్ర. పేదల బియ్యం తినేసి నీతి కబుర్లు చెబుతున్నారంటూ ధ్వజమెత్తారు.పేర్నిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. 187 టన్నుల బియ్యాన్ని దోచేశారని దుయ్యబట్టారు.పేర్ని కుటుంబం అంతా పరారీలోనే ఉందంటూ ఎద్దేవా చేశారు కొల్లు రవీంద్ర. దొంగ అయిన నానికి పరామర్శలు విడ్డూరమన్నారు.