ఒకే దేశం ఒకే ఎన్నికల బిల్లును లోక్ సభలో ప్రవేశ పెట్టారు. కాగా అధికారంలో ఉన్న మోడీ పార్టీకి చెందిన 20 మంది బీజేపీ సభ్యులు సభకు గైర్హాజరయ్యారు. జమిలి బిల్లు కోసం అధిష్టానం విప్ జారీ చేసినా లోక్సభకు హాజరుకాక పోవడం విస్తు పోయేలా చేసింది. దీంతో సదరు గైర్హాజరైన ఎంపీలకు నోటీసులు జారీ చేసింది బీజేపీ హైకమాండ్.