యూపీలోని ప్రయాగ్ రాజ్ లో జరుగనున్న మహాకుంభ మేళలో శ్రీవారి నమూనా ఆలయం ద్వారా ఉత్తరాది భక్తులు స్వామి వారి వైభవాన్ని సంతృప్తిగా తిలకించేలా పటిష్ట ఏర్పాట్లు చేపట్టాలని టిటిడి జేఈవో గౌతమి అధికారులకు సూచించారు. 45 రోజుల పాటు సాగే మహాకుంభ మేళకు దాదాపు 2.50 ఎకరాల విస్తీర్ణంలో టిటిడి నుండి విస్తృత ఏర్పాట్లు చేస్తోందన్నారు.