తిరుచానూరులోని అన్నదానం కాంప్లెక్స్లో టీటీడీ జేఈవో వీరబ్రహ్మం సెల్ఫ్ సర్వీస్ కియోస్క్ను ప్రారంభించారు. ఈ మెషిన్ భక్తుల నుండి రూ. 1లక్ష వరకు విరాళాలను స్వీకరిస్తుంది. కెనరా బ్యాంక్ కియోస్క్ మిషన్ను విరాళంగా ఇచ్చింది. అంతకు ముందు తిరుమలలోని వెంగమాంబ అన్నదానం సత్రంలో మరో ప్రభుత్వరంగ బ్యాంకు కియోస్క్ ను ఏర్పాటు చేసింది. దీనిని టీటీడీ అడిషనల్ ఈవో ప్రారంభించారు.