జర్నలిస్టులకు ఉచిత కంటి వైద్య శిబిరం
NEWS Dec 17,2024 10:29 am
నిజామాబాద్లోని డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి, నిజామాబాద్ ఆధ్వర్యంలో నిజామాబాద్ ప్రెస్ క్లబ్ లో హెల్త్ క్యాంప్ నిర్వహించారు. జర్నలిస్టులు, కుటుంబ సభ్యుల కంటి సమస్యల పరిష్కారానికి ప్రెస్ క్లబ్ కమిటీ చొరవతో డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో ప్రత్యేక కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. శిబిరానికి జర్నలిస్టుల నుండి చక్కని స్పందన లభించింది. ఉదయం 11 గంటల నుండి శిబిరం ప్రారంభం కాగా, సాయంత్రం వరకు దాదాపు 130 మందికి పైగా జర్నలిస్టులు తమ కళ్లను పరీక్షలు చేయించుకున్నారు.