వెల్లుల్ల ఎల్లమ్మ దేవాలయం వద్ద ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. ఎల్లమ్మ దేవాలయాన్ని ఎండోమెంట్ పరిధిలోకి వద్దంటూ గ్రామస్తులు గత వారం రోజులుగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అయితే మంగళవారం సందర్భంగా దేవాలయానికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. ఎండోమెంట్ ఏవో కాంతరెడ్డి తన విధుల్లో భాగంగా నేడు ఎల్లమ్మ ఆలయం వద్దకు రావడంతో గ్రామస్తులు భారీ సంఖ్యలో పాల్గొని ఏవోను అడ్డుకున్నారు. క్యాన్సిలేషన్ఆర్డర్ తీసుకొస్తామని అప్పటి ఎవరు రావద్దని గ్రామస్తులు కోరారు.