చేర్యాలను రెవెన్యూ డివిజన్ చేయాలి
NEWS Dec 17,2024 07:21 am
అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. చేర్యాలను రెవెన్యూ డివిజన్ చేయాలని కోరారు బీఆర్ఎస్ ఎమ్మల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి. ఈ అంశాన్ని పరిశీలిస్తామన్నారు మంత్రి పొంగులేటి. కాగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి జోక్యం చేసుకుని పల్లా కోరిన కోరిక న్యాయమైనదని, దానిని నెరవేర్చాలని పొంగులేటిని కోరారు. చేర్యాలతో పాటు మక్తల్, ఆలేరును కూడా రెవిన్యూ డివిజన్లు చేయాలని సూచించారు.