చెక్కు విత్ డ్రా పేరిట మోసం
NEWS Dec 17,2024 06:12 am
నిజామాబాద్ ఆర్మూర్: బ్యాంకులో చెక్కు ద్వారా డబ్బులు విత్ డ్రా చేసేందుకు వచ్చిన ఓ వృద్ధుడిని గుర్తు తెలియని వ్యక్తి మాయ మాటలతో మోసగించాడు. ఈ ఘటన నందిపేటలో జరిగింది. యూనియన్ బ్యాంకులో తన్నురి నాగన్న అనే వృద్ధుడు నగదు డ్రా చేసేందుకు చెక్కు తీసుకుని రాగా, గమనించిన ఓ వ్యక్తి తనకు క్యాషియర్ తెలుసని, డబ్బులు త్వరగా డ్రా చేసి ఇస్తానని నమ్మించారు. నాగన్న వద్ద ఉన్న చెక్కును తీసుకుని రూ.26 వేలు ఎట్టుకెళ్లాడు.