మాజీ మంత్రి హరీశ్ రావు నిప్పులు చెరిగారు. టీజీపీఎస్సీ తాజాగా నిర్వహించిన గ్రూప్ -2 పరీక్షల్లో ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రశ్నలు ఇవ్వడంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అసలు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషనా లేక ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్ష తయారు చేసిందా అని ధ్వజమెత్తారు. తెలంగాణ ఆనవాళ్లు లేకుండా చేయాలని అనుకుంటున్న రేవంత్ కు బుద్ది చెప్పడం ఖాయమన్నారు.