కొడుకు అన్నం పెడతాలేదంటూ కలెక్టరుకు ఫిర్యాదు
NEWS Dec 16,2024 06:54 pm
కొడుకు అన్నం పెడతలేడని వృద్ధ తల్లిదండ్రులు కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. జగిత్యాల పట్టణంలోని గోవింద్ పల్లికి చెందిన ముల్లె నారాయణ, రాజవ్వ అనే దంపతులు సోమవారం జరిగిన ప్రజావాణిలో కలెక్టర్ సత్య ప్రసాద్ కు తమ గోస చెప్పుకున్నారు. తమ పేరుపై ఉన్న 57 గుంటల భూమిని కొడుకు తీసుకున్నాడని, నిత్యం వేధింపులకు గురి చేస్తున్నాడని తెలిపారు. తమకు ఇక చావే శరణ్యం అని ఆవేదన వ్యక్తం చేశారు.