పోలవరం ప్రాజెక్టు పూర్తయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడిగా మారుతుందన్నారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. ఈ ప్రాజెక్టుకు పూర్తి చేసి నదులు అనుసంధానం చేస్తే ఇది ఓ గేమ్ ఛేంజర్ గా తయారవుతుందన్నారు. అన్ని జిల్లాలకు నీటి సమస్య అనేదే ఉండదన్నారు. రివర్స్ టెండరింగ్ అనే పేరు పెట్టి పోలవరం ప్రాజెక్టును సర్వ నాశనం చేశారని ఆరోపించారు సీఎం.