విద్యారంగ సమస్యలపై ఏబీవిపి పోరాటం
NEWS Dec 17,2024 06:14 am
ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంఘం ఏబీవీపీ అని, దేశంలో ఎక్కడ ఏ విద్యార్థికి సమస్య ఉన్నా పోరాటం చేస్తోందని పరిషత్ ఇందూర్ విభాగ్ సంఘటన మంత్రి రాజ్సాగర్ పేర్కొన్నారు. నిజామాబాద్ నగరంలోని ఎస్ఎస్ఆర్ డిస్కవరీ పాఠశాలలో నిర్వహిస్తున్న ఏబీవీపీ శిక్షణ తరగతులు ముగిశాయి. జాతీయ సమైక్యత విద్యారంగా సమస్యలపై పోరాటం చేస్తామ్నన్నారు. 2 రోజుల పాటు కొనసాగిన శిక్షణ తరగతుల్లో 4 జిల్లాల విద్యార్థి ప్రతినిధులు పాల్గొని, ఎన్నో విషయాలు నేర్చుకున్నారన్నారు.