శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.47 కోట్లు
NEWS Dec 16,2024 05:00 am
తిరుమల శ్రీవారిని నిన్న 66,160 మంది భక్తులు దర్శించుకున్నారు. 22, 724 మంది భక్తులు స్వామి వారికి తలనీనాలు సమర్పించారు. కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.47 కోట్లు వచ్చింది. ప్రస్తుతం భక్తులు 18 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. ఎలాంటి టోకెన్లు లేకుండా సర్వ దర్శనానికి 12 గంటలకు పైగా సమయం పడుతుందని ఈవో వెల్లడించారు.