సహకారంతోనే సుపరిపాలన సాధ్యం
NEWS Dec 16,2024 04:40 am
పరస్పర సహకారంతోనే సుపరిపాలన సాధ్యమవుతుందని స్పష్టం చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. కేంద్ర, రాష్ట్రాల మధ్య సత్ సంబంధాలు ఉండాలన్నారు. లేక పోతే పాలనా పరంగా ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందన్నారు . చర్చలు వృద్దిని మరింత పెంచడం, సమర్థవంతమైన పాలనను నిర్ధారించడం, పౌరులకు మెరుగైన సేవలు అందించడంపై ఫోకస్ పెట్టాలన్నారు పీఎం.