తబలా విధ్వాంసుడు ఉస్తాద్ జాకీర్ హుస్సేన్ కన్ను మూశారు. కాలిఫోర్నియాలో ఆయన చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన వయసు 73 ఏళ్లు. తబలాను ప్రపంచ స్థాయికి తీసుకు వెళ్లిన అరుదైన కళాకారుడు . యావత్ భారత దేశం తన మృతితో తీవ్ర విషాదానికి లోనైందని పీఎం నరేంద్ర మోడీ పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.