శ్రీశైలం పోటెత్తిన భక్తజనం
NEWS Dec 16,2024 04:02 am
ప్రముఖ శివాలయ క్షేత్రం శ్రీశైల మల్లికార్జున స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. శ్రీగిరి క్షేత్రం జన సంద్రంగా మారి పోయింది. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చారు. స్వామి వారి దర్శనానికి 6 గంటలకు పైగా సమయం పడుతుందని ఆలయ ఈవో వెల్లడించారు.