బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ సీరియస్ అయ్యారు. రాష్ట్రంలో రాచరిక పాలన సాగుతోందని, రేవంత్ రెడ్డి నయా దేశ్ ముఖ్ లాగా వ్యవహరిస్తున్నాడని ధ్వజమెత్తారు. విద్యార్థులు సమస్యలు చెప్పుకునే వీలు లేకుండా చేశాడని ఆరోపించారు. విద్యా రంగాన్ని భ్రష్టు పట్టించాడని, కావాలని గురుకులాలను నాశనం చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు.