పొట్టి శ్రీరాములు ఆత్మార్పణం చేసుకోవడం వల్లనే ఆనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సిద్దించిందని లేక పోతే వచ్చి ఉండేది కాదన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. రాష్ట్ర వ్యాప్తంగా ఆత్మార్పణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా పొట్టి శ్రీరాములుకు నివాళులు అర్పించారు. పొట్టి శ్రీరాములు నిత్య ప్రాతః స్మరణీయుడని కొనియాడారు. ఆయన స్పూర్తి ఆంధ్ర జాతికి దిక్సూచి అన్నారు.