జగిత్యాల జిల్లాలో గ్రూప్-2కు 48.35% హాజరు
NEWS Dec 15,2024 10:09 am
జగిత్యాల జిల్లా వ్యాప్తంగా నేడు జరుగుతున్న గ్రూప్-2 పరీక్షకు ఉదయం సెషన్లో 48.35% మంది అభ్యర్థులు హాజరైనట్లు అధికారులు ప్రకటించారు. మొత్తం 10,907 మంది అభ్యర్థులకు గాను 5,274 మంది హాజరు కాగా 5,633 మంది గైర్హాజరైనట్లు పేర్కొన్నారు. గ్రూప్-2 పరీక్షకు సగం మంది అభ్యర్థులు కూడా హాజరు కాకపోవడం గమనార్హం.