గ్రూప్-2 పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్
NEWS Dec 15,2024 10:08 am
జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఎస్కేఎన్ఆర్, కోరుట్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల, అరుణోదయ డిగ్రీ కళాశాల, మల్యాల మండలంలోని జేఎన్టీయూలలో ఏర్పాటు చేసిన గ్రూప్-2 ఎగ్జామ్ సెంటర్లను కలెక్టర్ సత్యప్రసాద్ తనిఖీ చేశారు. పరీక్షలు నిర్వహిస్తున్న తీరును పరిశీలించారు. పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. ఆయన వెంట పలువురు అధికారులు ఉన్నారు.