కొత్త మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం
NEWS Dec 15,2024 10:22 am
రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా రూపొందించిన డైట్ మెనూ ప్రకారం గురుకుల, వసతి గృహాల్లో విద్యార్థులకు భోజనం అందించాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు నిర్వాహకులకు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం డైట్లో 40 శాతం, కాస్మోటిక్ లో 200 శాతం చార్జీలను పెంచిందన్నారు. మూడో తరగతి నుంచి ఏడవ తరగతి వరకు రూ. 950 నుంచి రూ. 1330 వరకు, 8వ తరగతి నుంచి పదవ తరగతి వరకు రూ. 900 నుంచి రూ. 1540 వరకు చార్జీలను పెంచినట్లు తెలిపారు. పెంచిన చార్జీలకు అనుగుణంగా మెనూను పాటించాలని సూచించారు.