గ్రూప్ 2 మొదటి సేషన్స్ పరీక్ష నేపద్యంలో నిజామాబాద్ ఇంచార్జీ పోలీస్ కమీషనర్ సింధూశర్మ వివిధ కళాశాలలో పరీక్షా కేంద్రాలను పరిశీలించారు. అక్కడ విధులలో ఉన్న సిబ్బందికి పలు సూచనలు చేశారు. 63 పరీక్షా కేంద్రాలలో ప్రశాంతంగా ఈ పరీక్ష కొనసాగుతుందని తెలిపారు. పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ను అమలు చేస్తూ పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అభ్యర్థులు సకాలంలో పరీక్ష కేంద్రాలకి రావాలని విజ్ఞప్తి చేశారు.