బీజేపీ బూత్ కమిటీ ఎన్నిక ఏకగ్రీవం
NEWS Dec 15,2024 10:21 am
బీజేపీ అధిష్టానం ఆదేశానుసారం కథలాపూర్ మండల్ తక్కలపల్లి గ్రామంలో పార్టీ బూత్ అధ్యక్షులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇందులో 55 బూత్ అధ్యక్షునిగా మిట్టపల్లి లక్ష్మారెడ్డి, ప్రధాన కార్యదర్శిగా మిట్టపల్లి జైపాల్ రెడ్డి, 56 భూత్ అధ్యక్షునిగా ఎల్లా గంగాధర్ ప్రధాన కార్యదర్శిగా సైదు నరేష్, 57 బూత్ అధ్యక్షులుగా బర్రె మధు, ప్రధాన కార్యదర్శిగా గుగ్గిళ్ళ నూతన్ ప్రసాదును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.