కలెక్టర్ గ్రూప్-2 పరీక్షా కేంద్రాల తనిఖీ
NEWS Dec 15,2024 10:23 am
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నిర్వహిస్తున్న గ్రూప్-2 పరీక్షలు కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ ఆదివారం ప్రారంభం అయ్యాయి. జిల్లా కేంద్రంలోని దీక్ష, వశిష్ఠ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షలు నిర్వహిస్తున్న తీరును నిశితంగా పరిశీలించారు. నిబంధనలు పక్కాగా పాటిస్తున్నారా లేదా అన్నది గమనించి అధికారులకు కలెక్టర్ పలు సూచనలు చేశారు.