మెట్పల్లి: పొట్టి శ్రీరాములకు నివాళులు
NEWS Dec 15,2024 10:13 am
పొట్టి శ్రీరాముల వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు మెట్పల్లి ఆర్యవైశ్య సంఘం నాయకులు. ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు మైలారపు రాంబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కార్యదర్శి ఎల్మీ రవి, సంయుక్త కార్యదర్శి కొత్త నవీన్, వాసవి దేవాలయం అధ్యక్షులు చాడ సురేష్, వాసవి గార్డెన్ అధ్యక్షులు కోట కిరణ్, వాసవి విద్యా కమిటీ అధ్యక్షులు పడిగల శ్రీనివాస్, కార్యదర్శి బండారి శివ, యువజన సంఘం అధ్యక్షులు చకినం కేదార్నాథ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ పుల్లూరి నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.