నేడు..రేపు గ్రూప్ -2 పరీక్షలు
NEWS Dec 15,2024 03:27 am
తెలంగాణలో గ్రూప్ -2 పరీక్షలు జరగనున్నాయి. రెండు సెషన్లలో ఈ పరీక్షలను నిర్వహించనుంది టీజీపీఎస్సీ . ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటలకు పేపర్ -1 పరీక్ష. మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు పేపర్ -2 పరీక్ష ఉంటుంది. రేపు ఉదయం 10 నుంచి 12. గంటల దాకా పేపర్-3 పరీక్ష, మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు పేపర్ -4 పరీక్ష ఉంటుంది. 33 జిల్లాల్లో 1,358 కేంద్రాలలో 5.51 లక్షల మంది హాజరు కానున్నారు.