పబ్లిక్ ఫర్ సోషల్ జస్టిస్ ఆల్ ఇండియా జాయింట్ సెక్రెటరీగా వార రాజశేఖర్
NEWS Dec 14,2024 06:23 pm
పబ్లిక్ ఫర్ సోషల్ జస్టిస్ సంస్థకు ఆల్ ఇండియా జాయింట్ సెక్రెటరీగా దళిత వాయిస్ తెలుగు దినపత్రిక ఎడిటర్ చైర్మన్ వార రాజశేఖర్ ను నియమిస్తూ నీతి అయోగ్ ప్రతినిధి మాధవరావు ఉత్తర్వులు జారీ చేశారు. రాజశేఖర్ తన స్వచ్ఛంద సంస్థ ద్వారా చేస్తున్న సేవలకు గుర్తింపుగా ఈ నియామకం చేపట్టినట్లు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ప్రజల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానన్నారు.