సభ్యత్వ నమోదు ముమ్మరంగా చేయాలి
NEWS Dec 14,2024 05:27 pm
కామారెడ్డి బీజేపీ జిల్లా కార్యాలయంలో రాష్ట్ర, జిల్లా నాయకులు, మండల అధ్యక్షుల సమావేశం నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర సంఘటన కార్యదర్శి చంద్రశేఖర్ మాట్లాడుతూ.. జిల్లాలోని అన్ని మండలాల్లో అర్హత సాధించిన బూత్ లలో నూతనంగా బూత్ కమిటీలు ఏర్పాటు చేయాలనీ అన్నారు.బీజేపీ సభ్యత్వ నమోదు, క్రియాశీల సభ్యత్వ నమోదు, సంస్థాగత ఎన్నికలు, బూత్ కమిటీలు, మండల కమిటీ ల ఎన్నిక ల విషయమై చర్చించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు.